బాలయ్యతో బోయపాటి సస్పెన్స్ డ్రామా !

బాలయ్యతో బోయపాటి సస్పెన్స్ డ్రామా !

Published on Apr 10, 2020 6:29 PM IST

బాలయ్య బాబు హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే అనేక రకాలుగా చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే బాలయ్య ఈ సినిమాలో క‌వ‌ల‌లుగా నటించబోతున్నారట. అందులో ఒక క్యారెక్టర్ విలన్ అని.. హీరో క్యారెక్టర్ కి, విలన్ క్యారెక్టర్ కి మధ్య జరిగే సస్పెన్స్ డ్రామానే బోయపాటి తనదైన మాస్ స్టైల్ లో తెరకెకెక్కించబోతున్నారని తెలుస్తోంది. సెకెండ్ హాఫ్ లో హీరో ఎవరు విలన్ ఎవరు అనే కోణంలో వచ్చే సస్పెన్స్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. గతంలో బాలయ్య కవలలుగా నటించారు. మళ్లీ చాలా ఏళ్ల త‌ర్వాత ఈ సినిమాలో క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌.

ఇప్పటికే ఒక హీరోయిన్ గా అంజలిని ఫైనల్ చేసింది టీం. కాగా ఈ సినిమాలో శ్రియా సరన్ ను ఓ కీలక పాత్ర కోసం తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రియా బాలయ్య సరసన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే సినిమాలో కలిసి నటించింది. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు