“విశ్వంభర” పై లేటెస్ట్ అప్డేట్..

“విశ్వంభర” పై లేటెస్ట్ అప్డేట్..

Published on Oct 4, 2024 12:00 PM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామా “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ అలాగే డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్నీ ఏకకాలంలో జరిగిపోతున్నాయి.

ఇక ఈ సినిమాపై ఇపుడు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాలో రెండు పాటలు షూటింగ్ మినహా మిగతా అంతా కంప్లీట్ అయ్యిపోయినట్టుగా తెలుస్తుంది. ఇవి కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసేసి ఈ జనవరి బరిలోనే సినిమాని దింపే సన్నాహాలు మేకర్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు