తన కెరీర్లో చాలా తక్కువ సమయం లోనే ప్రశాంత్ వర్మ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను తన చివరి చిత్రం జాంబి రెడ్డితో కమర్షియల్ సక్సెస్ సాధించాడు. అతను ప్రస్తుతం తేజ సజ్జ ప్రధాన పాత్రలో తన తాజా ప్రాజెక్ట్ హను మాన్తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు దర్శకుడు ఈ రోజు సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ప్రేక్షకులను సహనం గా ఉండాలని కోరారు.
ప్రేక్షకులకు బెస్ట్ అవుట్పుట్ అందించడానికి విజువల్ ఎఫెక్ట్స్ టీమ్తో అహోరాత్రులు శ్రమిస్తున్న విషయాన్ని వెల్లడించారు. అసాధారణమైన దానికంటే తక్కువ ఏదైనా అందించాలని జట్టు కోరుకోవడం లేదని ప్రశాంత్ పేర్కొన్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రం లో వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంది. ఈ సూపర్ హీరో చిత్రంలో అమృతా అయ్యర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్, కృష్ణ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.