జర్మనీలో ప్లాన్ చేస్తున్న రాజమౌళి ?

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ పై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. డిసెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారని.. మొదటి షెడ్యూల్ షూటింగ్ ను జర్మనీలో మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కి సంబంధించి త్వరలోనే యూనిట్ సభ్యులందరికి వర్క్ షాప్ నిర్వహిస్తారట.

కాగా ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రాబోతుంది. 2027 జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని టాక్. ఇక, ఈ సినిమాలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ పాత్రలో నటిస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ, ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది.

Exit mobile version