అన్నాత్తే తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ అనే ఆసక్తికరమైన యాక్షన్ డ్రామాతో తన అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో బాహుబలి నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందని, రేపు ఆమె సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం.
గతంలో వీరిద్దరూ కలిసి పడిక్కదవన్, నరసింహ చిత్రాల్లో నటించారు. వీరిద్దరు కలిసి మళ్లీ తెరపై చూడాలని అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. రమ్య కృష్ణన్ తర్వాత లైగర్లో కనిపించనుంది. అయితే హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలో జైలర్ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.