ఆ స్టార్స్‌ తో సినిమా చేస్తున్నా – లోకేశ్‌ కనగరాజ్‌

ఆ స్టార్స్‌ తో సినిమా చేస్తున్నా – లోకేశ్‌ కనగరాజ్‌

Published on Oct 14, 2024 8:03 AM IST

దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కి యాక్షన్ డైరెక్టర్ గా సౌత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ వంటి చిత్రాలు అద్భుత విజయాలు సాధించాయి. ప్రస్తుతం లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా లోకేశ్‌ కనగరాజ్‌ అభిమానులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో లోకేశ్‌ కనగరాజ్‌ తన సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎల్‌సీయూ)పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇంతకీ, లోకేశ్‌ కనగరాజ్‌ ఏం మాట్లాడారు అంటే.. ‘‘ఖైదీ’, ‘విక్రమ్‌’, ‘లియో’తో లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ మొదలైంది. దానిని సరైన విధంగా పూర్తి చేయాలి. ‘విక్రమ్‌’ని అద్భుతంగా పూర్తి చేసేందుకు ‘రోలెక్స్‌’ సీన్స్‌ క్రియేట్‌ చేశా. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్‌ దృష్టిలో ఉంచుకుని ‘రోలెక్స్‌’పై ఒక స్టాండలోన్‌ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నా. ‘కూలీ’ పూర్తి చేసిన తర్వాత, LCUలోని హీరోలందరితో పీక్‌ ఎల్‌సీయూ మూవీ చేయబోతున్నాను’ అని లోకేశ్‌ కనగరాజ్‌ చెప్పుకొచ్చారు. అన్నట్టు తన యూనివర్స్‌లో ‘కూలీ’ భాగం కాదని లోకేశ్‌ కనగరాజ్‌ క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు