లవ్ టుడే హీరోతో ప్రేమలు హీరోయిన్…త్వరలో అనౌన్స్ మెంట్!?

లవ్ టుడే హీరోతో ప్రేమలు హీరోయిన్…త్వరలో అనౌన్స్ మెంట్!?

Published on Jul 25, 2024 12:00 AM IST

తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా, లవ్ టుడే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగులో డబ్ చేయగా, మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అదే విధంగా మలయాళం మూవీ ప్రేమలు చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ మమిత బైజు. ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అయ్యి సెన్సేషన్ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. వీరి తదుపరి చిత్రాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

లేటెస్ట్ బజ్ ఏమిటంటే, వీరిద్దరూ కలిసి ఒక చిత్రాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది అని వార్తలు వస్తున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే కాంబినేషన్ వర్కౌట్ అయితే, ఫ్యాన్స్ కి మంచి ఎంటర్ టైన్మెంట్ పక్కా అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు