‘మహా సముద్రం’.. ఇద్దరి చెడ్డవాళ్ల కథ !

‘మహా సముద్రం’.. ఇద్దరి చెడ్డవాళ్ల కథ !

Published on Jan 19, 2021 12:08 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ అజ‌య్ భూప‌తి ‘మహా సముద్రం’ శర్వానంద్ – సిద్ధార్ద్ కీలకపాత్రలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇద్దరు చెడ్డవాళ్ల మధ్య జరిగే కథ అట. శర్వానంద్ – సిద్ధార్ద్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అద్భుతంగా ఉంటాయట. ఇక శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడట. పైగా ఈ చిత్రంలో ఇంట్రస్టింగ్ ప్రేమకథ కూడా ఉందని.. సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా కూడా ఉంటుందట. త్వరలోనే ఈ సినిమా తరువాత షెడ్యూల్ ను సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం చిత్రం తెరకెక్కనుందని సమాచారం. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. ఫ్యామిలీ అండ్ యూత్ ఫుల్ హీరో అనే ఇమేజ్ ఉన్న శర్వానంద్ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్రలో ఎలా కనిపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు