‘మత్తు వదలరా 2’పై మహేష్ ఫిదా!

‘మత్తు వదలరా 2’పై మహేష్ ఫిదా!

Published on Sep 15, 2024 1:00 AM IST

టాలీవుడ్‌లో ఈవారం రిలీజైన చిత్రాల్లో క్రేజీ సీక్వెల్‌గా వచ్చిన ‘మత్తు వదలరా 2’ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు రితేశ్ రానా డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఇది ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే, తాజాగా ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫిదా అయ్యాడు.

మహేష్ తాజాగా ‘మత్తు వదలరా 2’ చిత్రాన్ని వీక్షించారు. ఈమేరకు తన ట్విట్టర్‌లో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘మత్తు వదలరా 2’ నవ్వులతో సాగే రైడ్. ఈ సినిమాలో శ్రీ సింహా సహజ నటన ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ వచ్చినప్పుడు తన కూతురు పడిపడి నవ్వుకుంది. ఇక సత్య.. అతడు వచ్చినప్పుడు అందరూ నవ్వులతో సినిమాను ఎంజాయ్ చేశారు.

ఇలా మహేష్ ట్వీట్ సాగడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. తమ సినిమాకు మహేష్ ప్రశంసలు బూస్ట్ అవుతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘మత్తు వదలరా 2’ చిత్రంలో శ్రీసింహా, సత్య, ఫరియా అబ్దుల్లా సాలిడ్ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు