యువ హీరో సినిమా ట్రైలర్ ను లాంచ్ చేయనున్న మహేష్ !

యువ హీరో సినిమా ట్రైలర్ ను లాంచ్ చేయనున్న మహేష్ !

Published on Jan 9, 2018 11:01 AM IST

manasuku nachindi

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న చిత్రాల్లో మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘మనసుకు నచ్చింది’ కూడా ఒకటి. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రోమో సాంగ్స్, లిరికల్ వీడియోస్ కు మంచి స్పందన లభించగా ఈరోపీజు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు టీమ్.

ఈ ట్రైలర్ ను మంజుల సోదరుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. దీంతో సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇందులో సందీప్ కిషన్ కు జంటగా అమైరా దస్తూర్ నటిస్తోంది. పి. కిరణ్, సంజయ్ స్వరూప్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రతన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాను జనవరి 26న రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు