అనురాగ్ కొణిదెన హీరోగా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ”మళ్ళీ మళ్ళీ చూశా”. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రేపు 150కి పైగా థియేటర్స్లో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. మరి స్టూడెంట్స్ లైఫ్ కి సంబంధించిన ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ సినిమాలో స్టోరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందట.
ఒక స్టూడెంట్ తనకి దొరికిన డైరీ సాయంతో ఒక అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు, దానిలో భాగంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది అనే పాయంట్ ను దర్శకుడు స్క్రీన్ మీద చాలా గ్రిప్పింగ్ గా చెప్పాడని… మొత్తానికి స్టూడెంట్ లైఫ్ కి సంబందించిన ఒక మంచి లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతుందని చిత్రబృందం చెబుతుంది. ఆలాగే ఈ సినిమాలో శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, ఎలేంద్ర మహావీర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మంచి ప్లస్ అవుతాయట.