అది నన్ను ఎంతో బాధించింది – మంచు మనోజ్‌

అది నన్ను ఎంతో బాధించింది – మంచు మనోజ్‌

Published on Sep 22, 2024 4:44 PM IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుని కలుపుతున్నారని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగడం తనను ఎంతో బాధించింది అంటూ హీరో మంచు మనోజ్‌ ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ, మనోజ్ తన పోస్ట్ లో ఏం పెట్టారంటే.. ‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తూ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడారని తెలిసి ఎంతో కలత చెందాను. ఇది కేవలం తప్పు మాత్రమే కాదు. భక్తుల మనోభావాలను అవమానించడం.

ఈ తరుణంలో అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి. బాధ్యులను గుర్తించాలి. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. సంస్కృతి, మతపరమైన విలువలను గౌరవించాలి. సంప్రదాయాలను ఉల్లంఘిస్తే సహించబోమనడానికి ఇదొక ఉదాహరణ కావాలి’’ అని మనోజ్‌ రాసుకొచ్చారు. మనోజ్ ప్రస్తుతం మిరాయ్ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ “మిరాయ్” సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు