మా మధ్య కాంట్రవర్సీ లేదు – మంచు విష్ణు

తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ జరిగిందని వచ్చిన వార్తల నేపథ్యంలో మంచు విష్ణు – నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ల మధ్య ఎక్స్‌ వేదికగా తీవ్ర సంభాషణ జరిగింది. తాజాగా ఈ అంశం పై మంచు విష్ణు కామెంట్స్ చేశారు. నా అభిప్రాయాన్ని తెలియజేయడం కోసమే నేను ఆ పోస్ట్‌ పెట్టాను. నాకు తెలిసి అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదు. ఇక ఆయన విషయానికి వస్తే (ప్రకాశ్‌రాజ్‌ ని ఉద్దేశించి).. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అదే విధంగా నా అభిప్రాయాన్ని కూడా నేను ఎక్స్ వేదికగా చెప్పాను.

మంచు విష్ణు ఇంకా మాట్లాడుతూ.. ‘ఒక హిందువుగా, తిరుపతి వాసిగా.. ఆ వివాదానికి మతం రంగు లేదని నేను చెప్పాలని అనుకున్నాను. అలాగే ఆయన కామెంట్స్ కూడా కరెక్ట్ కాదని చెప్పాను. నాన్నగారు నటించిన చాలా చిత్రాల్లో ఆయన నటించారు. ఎంతోకాలం నుంచి నాకు ఆయన తెలుసు. నేను ఆయనను అంకుల్‌ అని పిలుస్తుంటాను. నాకు ఆయన అంటే గౌరవం ఉంది. మా మధ్య ఎలాంటి కాంట్రవర్సీ లేదు’ అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

Exit mobile version