“మార్ ముంతా చోడ్ చింతా” సాంగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మణిశర్మ

“మార్ ముంతా చోడ్ చింతా” సాంగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మణిశర్మ

Published on Jul 26, 2024 10:00 PM IST

ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్, హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డబుల్ ఇస్మార్ట్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి, పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్దిరిపోయే మ్యూజిక్ అందించగా, రామ్ డాన్స్ ఇరగదీశారు. అయితే ఈ సాంగ్ లో మాజీ సిఎం కేసీఆర్ మాటలు అయిన ఏం జేద్దాం అంటావ్ ను సాంగ్ లో వాడటం జరిగింది. అయితే కేసీఆర్ ను గుర్తు చేసుకోడానికి, ఆయన అందరి ఫేవరెట్ అంటూ మణిశర్మ అన్నారు. అంతేకాక దీని గురించి ఎవరూ సీరియస్ కావొద్దు అని, సాంగ్ ను ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు