టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “మారుతీ నగర్ సుబ్రమణ్యం”

టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “మారుతీ నగర్ సుబ్రమణ్యం”

Published on Aug 24, 2024 1:01 AM IST

రావు రమేష్ ప్రధాన పాత్రలో, లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మారుతి నగర్ సుబ్రమణ్యం. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం అందించాడు.

ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానెల్ అయిన జీ తెలుగు సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ ముగిశాక, జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం కానుంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య ల నిర్మించిన ఈ చిత్రానికి ఎంఎన్ బాలరెడ్డి సినిమాటోగ్రఫర్ గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు