లాస్ట్ షెడ్యూల్ జరుపుకుంటున్న ‘మాస్ మహారాజు’

లాస్ట్ షెడ్యూల్ జరుపుకుంటున్న ‘మాస్ మహారాజు’

Published on Sep 6, 2023 10:19 PM IST

టాలీవుడ్ యువ నటులు రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న తాజా సినిమా మాస్ మహారాజు. సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతి రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి షెడ్యుల్ జరుపుకుంటుంది. గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, సంపద హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో హీరోలైన రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ ఇద్దరూ డిఫరెంట్ లుక్స్ లో పవర్ఫుల్ గా కనిపించబోతున్నారు. 1980 ల బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు సినిమా యూనిట్. తప్పకుండా రిలీజ్ తరువాత తమ సినిమాకి ఆడియన్స్ అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు