ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో “మత్తు వదలరా 2” రిలీజ్ డేట్ ఫిక్స్!

ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో “మత్తు వదలరా 2” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Aug 26, 2024 5:01 PM IST

శ్రీ సింహ మరియు కమెడియన్ సత్య ప్రధాన పాత్రల్లో, రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ మత్తు వదలరా. ఈ చిత్రం డిసెంబర్ 25, 2019 లో రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. మత్తు వదలరా 2 పేరిట ఈ చిత్రం సీక్వెల్ తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.

సెప్టెంబర్ 13, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతుంది. ఇదే విషయాన్ని ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. శ్రీ సింహ మరియు సత్య ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఇద్దరి చేతిలో గన్ లు ఉన్నాయి. వారిని ఎవరో గన్ లతో ఎటాక్ చేస్తున్నట్లు గా పోస్టర్ ఉంది. క్లాప్ ఎంటర్ టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు