డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “మత్తు వదలరా 2”

డిజిటల్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకున్న “మత్తు వదలరా 2”

Published on Sep 13, 2024 11:50 PM IST

శ్రీ సింహ కోడూరి, సత్య ప్రధాన పాత్రల్లో, దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా చిత్రం 2019 లో థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మత్తు వదలరా 2 అనే సీక్వెల్ ను మేకర్స్ తెరకెక్కించారు. వెన్నెల కిషోర్ తో పాటుగా, ఈ చిత్రంలో సునీల్ మరియు ఫరియా అబ్దుల్లా లు కీలక పాత్రల్లో నటించారు. నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇక్కడ ఉంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. అయితే త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు