బుక్ మై షో లో ట్రెండ్ అవుతోన్న “మత్తు వదలరా 2”

శ్రీ సింహ కోడూరి, సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో వచ్చిన మత్తు వదలరా చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ రేపు వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో వీరితో పాటుగా, సునీల్, ఫరియా అబ్దుల్లా లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

సినిమా పై మంచి హైప్ నెలకొని ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ కాగా, మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ బాగానే రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ టికెటింగ్ యాప్ అయిన బుక్ మై షోలో ఈ చిత్రం టాప్ లో ట్రెండ్ అవుతోంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ మరియు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించాడు.

Exit mobile version