మెగాస్టార్ చిరంజీవిని గత వారం ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్తో సత్కరించింది భారతీయ ప్రభుత్వం. చిరు ఈ అవార్డ్ పొందడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఈ సందర్భాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ గౌరవాన్ని పురస్కరించుకుని సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు మెగాస్టార్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈరోజు కుందవరపు శ్రీనివాస్ నాయుడు తన అభిమాన నటుడి విజయాన్ని స్మరించుకుంటూ స్టైలిష్ గా తన అభిమానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడు.
అతను న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లోని బిల్బోర్డ్పై చిరంజీవి యొక్క విజువల్స్ను పంచుకున్నాడు. అభినందనలు తెలిపే ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిరంజీవి వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర షూటింగ్ను ప్రారంభించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం వచ్చే సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది.