మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ లో ఉంటూనే, కష్ట సమయాల్లో ప్రజలకు తోచిన సహాయం చేస్తున్నారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారి విపత్తు సమయం లో కూడా మెగాస్టార్ చిరంజీవి ఇరు రాష్ట్రాలకు ఎంతో సహాయం చేశారు. ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ ను పెట్టబోతున్నారు. చారిటబుల్ ట్రస్ట్ మరియు మిష్టర్ చిరంజీవి వెబ్ సైట్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రస్ట్ ను మరియు వెబ్ సైట్ ను రేపు ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలు మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వద్ద మొదలు పెట్టనున్నారు. అంతేకాక ఇందుకు సంబంధించిన విషయాలను మీడియా తో వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ హాజరు కానున్నారు. పలు కార్యక్రమాల్లో తండ్రికి చేదోడు గా ఉన్న రామ్ చరణ్ ఈ కార్యక్రమం లో పాల్గొనటం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- లేటెస్ట్ : సినిమాల పై పుష్ప నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
- విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పై క్లారిటీ ఇదే
- అఫీషియల్ : ఈ తేదీన ఓటిటిలో “ఫ్యామిలీ స్టార్” వచ్చేస్తున్నాడు..
- “గేమ్ చేంజర్” ప్లాన్ లోనే “దేవర” ట్రీట్ కూడా?
- సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని మూవీ లేటెస్ట్ అప్ డేట్
- కృష్ణ గారి పై పవన్ వ్యాఖ్యలు బాధించాయి – సీనియర్ నరేష్
- ఇళయదళపతి తో మూవీ పై వెట్రిమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్