70 వసంతాలు పూర్తి చేసుకున్న బాలనాగమ్మ

70 వసంతాలు పూర్తి చేసుకున్న బాలనాగమ్మ

Published on Jan 29, 2012 9:18 PM IST

బాలనాగమ్మ చిత్రాన్ని నిజమైన తెలుగు ఆణిముత్యం గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం విడుదలై 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఏడుగురు యువరాజులు ఏడుగురు యువరాణులని వివాహమాడతారు. మాంత్రికుడు అతి పిన్న వయస్కురాలైన యువరాణి ని బలవంతంగా ఎత్తుకోనిపోతాడు. ఆ యువరాణి కొడుకు కనిపించని చెట్టులో ఉన్న పిట్టని కనిపెట్టి మాంత్రికుడిని ఎలా చంపాడు అన్నదే చిత్ర కథ. పతాక సన్నివేశాలు రామాయణ మరియు మహాభారతాలను తలపిస్తాయి. ఈ చిత్రంలో బాల నాగమ్మగా కాంచనమాల నటించగా సంగు గా పుష్పవల్లి మరియు రేలంగి కూడా నటించారు. ఈ సినిమాకి అసలైన మాంత్రికుడు కెమెరామెన్ ఎమ్. ఇరానీ అని చెప్పుకోవాలి. ఇండియన్ సినిమాని సరికొత్త దారిలో తీసుకెళ్ళిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈ చిత్రంలోని ఆన్ని శాఖలు సరిగా పనిచేయడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తరువాత మరిన్ని జానపద చిత్రాలు ఇంకా చాలా వచ్చాయి. ఈ చిత్రనికి గొప్ప దర్శకుడు కె.వి రెడ్డి (మాయా బజార్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జెమిని ఫిల్మ్స్ వారికీ కాసుల వర్షం కురిపించింది. బాలనాగమ్మ చిత్రం హిందీ కూడా నిర్మించగా మధుబాల హీరోయిన్ గా నటించగా మహానటి సావిత్రి గారు సంగు పాత్ర పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు