బాలనాగమ్మ చిత్రాన్ని నిజమైన తెలుగు ఆణిముత్యం గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం విడుదలై 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఏడుగురు యువరాజులు ఏడుగురు యువరాణులని వివాహమాడతారు. మాంత్రికుడు అతి పిన్న వయస్కురాలైన యువరాణి ని బలవంతంగా ఎత్తుకోనిపోతాడు. ఆ యువరాణి కొడుకు కనిపించని చెట్టులో ఉన్న పిట్టని కనిపెట్టి మాంత్రికుడిని ఎలా చంపాడు అన్నదే చిత్ర కథ. పతాక సన్నివేశాలు రామాయణ మరియు మహాభారతాలను తలపిస్తాయి. ఈ చిత్రంలో బాల నాగమ్మగా కాంచనమాల నటించగా సంగు గా పుష్పవల్లి మరియు రేలంగి కూడా నటించారు. ఈ సినిమాకి అసలైన మాంత్రికుడు కెమెరామెన్ ఎమ్. ఇరానీ అని చెప్పుకోవాలి. ఇండియన్ సినిమాని సరికొత్త దారిలో తీసుకెళ్ళిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈ చిత్రంలోని ఆన్ని శాఖలు సరిగా పనిచేయడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తరువాత మరిన్ని జానపద చిత్రాలు ఇంకా చాలా వచ్చాయి. ఈ చిత్రనికి గొప్ప దర్శకుడు కె.వి రెడ్డి (మాయా బజార్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జెమిని ఫిల్మ్స్ వారికీ కాసుల వర్షం కురిపించింది. బాలనాగమ్మ చిత్రం హిందీ కూడా నిర్మించగా మధుబాల హీరోయిన్ గా నటించగా మహానటి సావిత్రి గారు సంగు పాత్ర పోషించారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- లేటెస్ట్.. “వీరమల్లు” అవైటెడ్ టీజర్ కి తేదీ, సమయం ఖరారు
- “ఆ ఒక్కటీ అడక్కు” కంటెంట్ అందరికీ కనెక్ట్ వుంది – స్టార్ రైటర్ అబ్బూరి రవి
- “సలార్ 2” మిగతా షూట్ కి ఆల్ సెట్!?
- టాక్.. “ఇండియన్ 2” ఆడియో లాంచ్ డేట్ ఖరారు?
- సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రభాస్ “కల్కి” టీమ్!
- బజ్ : మరోసారి రిపీట్ కానున్న ‘నా సామిరంగ’ కాంబో ?
- విషాదం : దర్శకుడు త్రినాథరావు నక్కిన కు పితృ వియోగం