ఋషి ఆడియో వేడుకకి ముఖ్య అతిదిగా కమల్ హాసన్

ఋషి ఆడియో వేడుకకి ముఖ్య అతిదిగా కమల్ హాసన్

Published on Jan 29, 2012 2:50 PM IST

అరవింద్ కృష్ణ హీరోగా నటించిన ‘ఋషి’ చిత్ర ఆడియో వేడుకకి విలక్షణ నటుడు ‘కమల్ హాసన్’ ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. ఈ చిత్ర ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం 7:30 కి ప్రసాద్ మల్టిప్లెక్స్ లో 7:30 కి విడుదల చేయనున్నారు. ఈ ఆడియో వేడుకలో కమల్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈ చిత్రానికి స్నిగ్ధ మరియు చంద్రన్ సంగీతం అందించారు. అరవింద్ కృష్ణ సరసన సుప్రియ శైలజ హీరొయిన్ గా నటించింది. ఒక మెడికల్ స్టూడెంట్ సంఘం పై పోరాడే కథగా ఈ చిత్రం తెరకెక్కింది. రాజ్ మాదిరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ప్రసాద్స్ థియేటర్స్ అధినేత రమేష్ ప్రసాద్ గారు నిర్మించారు. అరవింద్ కృష్ణ గతంలో మధుర శ్రీధర్ డైరెక్షన్లో ‘ఇట్స్ మై లవ్ స్టొరీ’ చిత్రంలో నటించారు. రుషి అతను నటించిన రెండవ చిత్రం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు