ఇష్క్ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్

ఇష్క్ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్

Published on Jan 31, 2012 6:35 PM IST

త్వరలో రాబోతున్న నితిన్ ‘ఇష్క్’ ఆడియో వేడుకకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిదిగా రాబోతున్నారు. నితిన్ స్వయంగా గబ్బర్ సింగ్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి పవన్ కళ్యాణ్ ని ఆడియో వేడుకకి రమ్మని ఆహ్వానించారు. దాసరి నారాయణ రావు మరియు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈ వేడుకకి రాబోతున్నారని సమాచారం. డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ చిత్రాన్ని అర్బన్ లవ్ స్టొరీ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇటీవలే కేరళ మరియు కులుమనాలిలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ ఆడియో వేడుక ఫిబ్రవరి 2న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు