ట్విట్టర్ సెన్సార్షిప్ పై మాట్లాడిన మహేష్

ట్విట్టర్ సెన్సార్షిప్ పై మాట్లాడిన మహేష్

Published on Jan 29, 2012 5:00 PM IST

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ఈ మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. ట్విట్టర్ ను సెన్సార్ చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకోవాలి అనుకోవడమే దీనికి కారణం. దేశానికి కించపరుస్తూ ట్వీట్స్ ఉంటే సెన్సార్ చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. విదేశాలలో ఇది ఇప్పటికే అమల్లో ఉంది. దీనిపై చాలా మంది తీవ్రంగా ఖండించారు. ఆసక్తికరంగా ఫిలిం స్టార్స్ ఈ పద్ధతి పై తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మహేష్ బాబు ఈ పద్ధతికి స్వాగతం పలికారు. దేశానికి వ్యతిరేకంగా ట్వీట్స్ చేయడం ఆహ్వనిన్చాధగ్గా విషయం కాదని అన్నారు. ఈ రోజుల్లో ట్విట్టర్ పబ్లిక్ ఫోరం ల మారింది. అక్కడ తమ సొంత అభిప్రాయాలు చెప్పొచు కానీ మరీ కించపరిచేలా ఉండకూడదు అని అన్నారు.డాక్టర్ మోహన్ బాబు గారి కూతురైన లక్ష్మి మంచు మాట్లాడుతూ ఈ విషయం పై దూరంగా ఉండటం మంచిదన్నారు. మరికొందరు నటులు నుండి మిశ్రమ స్పందన లభించింది. దేశ భద్రత కోసమే ఈ పద్ధతి అమల్లోకి తేవాలనుకుంటున్నారు. దీనిపై మీరేమంటారు?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు