మోహన్ లాల్ చివరిసారిగా కనిపించిన మలైకోట్టై వాలిబన్ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇప్పుడు, నటుడు తన 360వ చిత్రం (L360) చిత్రీకరణ ఈ ఉదయం ప్రారంభమైనందున వార్తల్లో నిలిచాడు. మోహన్లాల్ సరసన 56వ సారి జతకట్టిన నటి శోభన కూడా సెట్స్లో జాయిన్ అయింది. మోహన్లాల్ ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
రేజాపుత్ర విజువల్ మీడియా పతాకంపై దర్శకుడు తరుణ్ మూర్తి నేతృత్వంలో ఎమ్. రెంజిత్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ చిత్రీకరణలో సెట్ లో పాల్గొన్న విషయాన్ని వెల్లడించారు. నేను నా ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను. నేను నా 360వ సినిమా వెంచర్ను ప్రారంభించాను అంటూ చెప్పుకొచ్చారు. షెడ్యూల్ కొన్ని వారాల పాటు కొనసాగుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి. మోహన్లాల్ కన్నప్ప, బరోజ్, L2: ఎంపురాన్, RAM: పార్ట్ 1 మరియు ఇతర చిత్రాలను పూర్తి చేయవలసి ఉంది.
On the set, joining in prayers as we commence filming the project led by director Tharun Moorthy and produced by M. Renjith under Rejaputhra Visual Media. I express my deepest gratitude and seek your blessings as I embark on my 360th film venture.#L360 #MRenjith #TharunMoorthy… pic.twitter.com/eGyxWizpkP
— Mohanlal (@Mohanlal) April 22, 2024