అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్”. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.
అంతేకాకుండా ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు, నైజాంలో మంచి కలెక్షన్లను చూస్తోంది. ఈ సినిమా ఆదివారం 1.2 కోట్లు సంపాదించింది.