నైజాంలో “మిస్టర్ బచ్చన్” డీల్ పూర్తి..!

నైజాంలో “మిస్టర్ బచ్చన్” డీల్ పూర్తి..!

Published on Jul 25, 2024 9:03 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “మిస్టర్ బచ్చన్” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రంపై సాలిడ్ బజ్ నెలకొంది. ఇక రీసెంట్ గానే ఈ ఆగస్ట్ 15న రిలీజ్ అంటూ అనౌన్స్ చేసేసారు. దీనితో పాటుగా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు ఈ సినిమా విషయంలో తెలుస్తున్నాయి.

ఈ చిత్రం తాజాగా అయితే నైజాం మార్కెట్ లో డీల్ ని పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అలాగే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మంచి ధర ఇచ్చి సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు తదితరులు నటించగా ఈ చిత్రాన్ని మేకర్స్ బాలీవుడ్ హిట్ చిత్రం రైడ్ కి రీమేక్ గా తెరకెక్కించారు. అలాగే మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు