ఓటీటీలోకి వచ్చేసిన ‘మిస్టర్ బచ్చన్’

ఓటీటీలోకి వచ్చేసిన ‘మిస్టర్ బచ్చన్’

Published on Sep 12, 2024 2:00 AM IST

మాస్ రాజా రవితేజ రీసెంట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ మంచి అంచనాల మధ్య ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. దర్శకుడు హరీష్ శంకర్‌తో రవితేజ మూడో సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా ఉండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు.

కట్ చేస్తే.. ఆగస్టు 15న సినిమా రిలీజ్ తొలి ఆటకే ఈ చిత్రానికి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకాదరణ పొందడంలో ఫెయిల్ అయ్యింది. కొన్ని అంశాలు బాగున్నా, సినిమాను ప్రేక్షకులు పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు. దీంతో ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోయిన ఈ సినిమాకు ఓటీటీ ఆడియెన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటించగా మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు