‘మిస్టర్ సెలెబ్రిటీ’ అందరినీ ఆకట్టుకుంటుంది – పరుచూరి గోపాలకృష్ణ

‘మిస్టర్ సెలెబ్రిటీ’ అందరినీ ఆకట్టుకుంటుంది – పరుచూరి గోపాలకృష్ణ

Published on Sep 26, 2024 10:30 AM IST

ప్రస్తుతం కొత్త కాన్సెప్టులనే ఆడియెన్స్ ఎక్కువ ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సుదర్శన్ పరుచూరి ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్.పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

ఇప్పటికే ‘మిస్టర్ సెలెబ్రిటీ’ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్, పాటలు ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ రిలీజ్ చేశారు. అక్టోబర్ 4న ఈ చిత్రం రిలీజ్ కానుందని ప్రకటించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘మా మనవడు పరుచూరి సుదర్శన్ నటించిన ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అక్టోబర్ 4న రాబోతోంది. మమ్మల్ని ఆదరించినట్టుగానే మా మనవడ్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. కొత్త దర్శకుడైనా కూడా సినిమాను బాగా తీశారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అక్టోబర్ 4న తప్పకుండా ‘మిస్టర్ సెలెబ్రిటీ’ సినిమాను అందరూ చూడండి’ అని కోరారు.

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ప్రేక్షకులు ఈ నలభై ఏళ్లుగా ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మా మనవడు పరుచూరి సుదర్శన్ అక్టోబర్ 4న ‘మిస్టర్ సెలెబ్రిటీ’ ద్వారా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గొప్పగా నిర్మించారు. దర్శకుడు అద్భుతంగా సినిమాను తీశారు. మా మనవడ్ని ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేయండి’ అని కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు