ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ధోని నిర్మించిన “ఎల్ జి ఎమ్”.!

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ధోని నిర్మించిన “ఎల్ జి ఎమ్”.!

Published on Sep 28, 2023 3:00 PM IST

ఇండియా ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తన క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత సినిమాల్లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కోలీవుడ్ లో నిర్మాతగా తన మొదటి సినిమాని నిర్మాణం వహించగా యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ ఇవానా హీరోయిన్ గా దర్శకుడు రమేష్ తమిళమణి తెరకెక్కించిన చిత్రం ఎల్ జి ఎం(లెట్స్ గెట్ మ్యారీడ్). అయితే రీసెంట్ రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం తమిళ్ సహా తెలుగులో రిలీజ్ అయ్యింది.

మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా ఓటిటి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం నేటి నుంచి ఒరిజినల్ వెర్షన్ తమిళ్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే తెలుగు వెర్షన్ కి సంబంధించి మరికొన్ని రోజులు తర్వాత యాడ్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడే సంగీతాన్ని అందించగా ఎం ఎస్ ధోని మొట్ట మొదటి ప్రొడక్షన్ సినిమాగా తెలుగులో కూడా మంచి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు