చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిమటా రమేష్ బాబు స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను – కీర్తన’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా నుండి తాజాగా ”కొంచెం కొంచెం గుడుగుడు గుంజం” అనే ఐటమ్ సాంగ్ ను సీనియర్ నటుడు మురళీ మోహన్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
“డైరెక్టర్ కమ్ హీరోగా వర్క్ చేయడం చాలా అరుదు. చిమటా రమేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా నేను రిలీజ్ చేసిన ఐటమ్ సాంగ్ థియేటర్లలో ఖచ్చితంగా విజిల్స్ వేయిస్తుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుతున్నా..” అంటూ మురళీ మోహన్ తన విషెస్ తెలిపారు.
ఇక ఈ సినిమాలో రిషిత, మేఘన హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిమటా లక్ష్మికుమారి ప్రొడ్యూస్ చేసిన ‘నేను-కీర్తన’ మూవీని అతి త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.