అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘సుడిగాడు’ సినిమాతో సంగీత దర్శకుడిగా శ్రీ వసంత్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తరువాత ఆయన పలు హిట్ సినిమాలకు సంగీతం అందించారు. అయితే, ఆయన ప్రస్తుతం రచయితగా మారారు. తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ ‘మహారాజ’ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది.
నిధిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేసిన ‘మహారాజ’ మూవీకి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే, ఈ సినిమాకు శ్రీ వసంత్ పాటలతో పాటు మాటలు కూడా రాశారు. ఈ సినిమాలోని ‘అమ్మ నీకే నాన్నయ్యనా’ అనే పాట బాగా పాపులర్ అయ్యింది. అజనీష్ లోక్ నాథ్ సంగీతం ఈ పాటకు మరో అసెట్ గా నిలిచింది.
ఇక శ్రీ వసంత్ కు చెందిన డబ్బింగ్ కంపెనీ “పోస్ట్ ప్రో మీడియా వర్క్స్ లోనే ‘మహారాజ’ మూవీ డబ్బింగ్ జరుపుకోవడం విశేషం. గతంలో ‘కార్తికేయ-2’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ కూడా ఇక్కడే డబ్బింగ్ జరుపుకుంది.
రచయితగా మారిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్
రచయితగా మారిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్
Published on Jun 14, 2024 9:35 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- థియేటర్/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!
- వీడియో : కల్కి 2898 AD – భైరవ గీతం పాట (ప్రభాస్)
- ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పై క్లారిటీ
- 2 మిలియన్ డాలర్లతో నార్త్ అమెరికాలో “కల్కి” విధ్వంసం!
- “పుష్పరాజ్” మాస్ లుక్ తో సరికొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!
- మహేష్ మరోసారి ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడా..?
- పోల్ : ‘కల్కి 2898 AD’ చిత్రం రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా?
- “పుష్ప 2” ఎందుకు ఆలస్యం? రివీల్ చేసిన మేకర్స్