ఈ సంవత్సరం తెలుగుకే అధిక ప్రాధాన్యమిస్తా: తమన్నా

ఈ సంవత్సరం తెలుగుకే అధిక ప్రాధాన్యమిస్తా: తమన్నా

Published on Feb 2, 2012 8:44 AM IST


ఈ 2012 సంవత్సరం అంతా అధిక ప్రాధాన్యత తెలుగు పరిశ్రమకే ఇస్తానంటుంది మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా. తెలుగులో ఈ సారి ఎక్కువగా సినిమాలు చేస్తాను. ఇప్పటికే మూడు సినిమాలు అంగీకరించడం జరిగింది. మరికొన్ని ప్రాజెక్టులు చర్చల్లో ఉన్నాయి, ఈ సంవత్సరం మొత్తం బిజీ షెడ్యుల్ ఉండబోతుంది. కొన్ని తమిళ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి కాని వాటిని అంగీకరించలేదు. తమన్నా చేస్తున్న పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో రామ్ చరణ్ తేజ్ సరసన ‘రచ్చ’, రామ్ తో ‘ఎందుకంటే ప్రేమంట’, ప్రభాస్ తో ‘రెబల్’ సినిమాలు ఈ సంవత్సరం మొదటి భాగంలో విడుదల కానున్నాయి. ప్రస్తుతం తమన్నా కి తెలుగులో బాగా డిమాండ్ ఉంది. దానిని సుస్థిరం చేసుకునేందుకే తెలుగులో ఎక్కువ సినిమాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు