మైత్రీ మూవీ మేకర్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేస్తోంది!

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్ నుండి నెక్స్ట్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయబోతున్న బిగ్గెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే, ఈ బ్యానర్ దసరా కానుకగా ఓ కొత్త ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయబోతుంది.

ఎనర్జిటిక్ హీరోతో పాటు న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ డైరెక్టర్ కలిస్తే ఇది ఎవర్‌లాస్టింగ్ కాంబినేషన్ అవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి క్లూ ఇచ్చారు. అయితే, ఇది ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నెక్స్ట్ మూవీగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్ర దర్శకుడు మహేశ్ బాబు డైరెక్షన్‌లో రామ్ పోతినేని ఓ సినిమా చేయనున్నాడనే వార్త గతకొద్ది రోజులుగా వినిపిస్తుంది.

ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ వారు అనౌన్స్ చేసింది ఇదే సినిమా అని నెట్టింట తెగ చర్చ సాగుతోంది. మరి నిజంగానే మైత్రీ మూవీ మేకర్స్ నుండి రాబోతున్న అప్డేట్ ఈ కాంబినేషన్ గురించేనా అనేది తెలియాలంటే అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version