ఆ వార్తలపై ‘కల్కి’ డైరెక్టర్ క్లారిటీ

ఆ వార్తలపై ‘కల్కి’ డైరెక్టర్ క్లారిటీ

Published on Aug 21, 2024 7:06 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘కల్కి 2898 AD’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందులోని మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ అభిమానులను థ్రిల్ చేశాయి. ఇక థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది.

ఆగస్టు 22న ‘కల్కి 2898 AD’ ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. హిందీ భాషలో నెట్‌ఫ్లిక్స్‌లో.. మిగతా భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఈ సమయంలో ‘కల్కి 2898 AD’కి సంబంధించి నెట్టింట సాగుతున్న కొన్ని చర్చలకు దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ రెండో భాగంలో తిరిగి వస్తాడని.. ప్రభాస్ అసలెవరనేది ఆయన రివీల్ చేస్తాడని.. ప్రభాస్ ఫ్యూచర్ నుంచి తన తల్లిని కాపాడటానికి వచ్చాడని.. రెండో పార్ట్‌లో సుప్రీమ్ యాస్కిన్‌తో యుద్ధంలో ప్రభాస్‌కు సహాయంగా విజయ్ దేవరకొండ కూడా జాయిన్ అవుతాడంటూ పలు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

అయితే, ఇవన్నీ కేవలం పుకార్లేనని నాగ్ అశ్విన్ తేల్చేశాడు. అసలు కథ ఏమిటో తెలియాలంటే రెండో పార్ట్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. ఇక ఈ సినిమాను వైజయంతి మూవీ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు