నాగ చైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “థ్యాంక్యూ”. ప్రముఖ నిర్మాత దిల్రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య మూడు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ చిత్రం యొక్క షూటింగ్ని పూర్తి చేసినట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు.
ఇకపోతే తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో మాళవిక నాయర్, అవికా గోర్లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో త్వరలోనే విడుదల తేదినీ ఫిక్స్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.