‘గుంటూరు కారం’ పుకార్ల పై నాగవంశీ క్లారిటీ

‘గుంటూరు కారం’ పుకార్ల పై నాగవంశీ క్లారిటీ

Published on Dec 18, 2023 12:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించి మాస్ సాంగ్ పై మహేష్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశారంటూ పుకార్లు వినిపించాయి. అయితే ఈ రూమర్స్‌పై గుంటూరు కారం నిర్మాత నాగవంశీ ట్విట్టర్ (ఎక్స్)‌లో క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ నాగవంశీ ఏం చెప్పారంటే.. ‘డియర్ సూపర్‌స్టార్ మహేష్ ఫ్యాన్స్, మూవీ లవర్స్.. గుంటూరు కారం సినిమాలో మొత్తం నాలుగు ఫుల్ సాంగ్స్‌తో పాటూ ఒక బిట్ సాంగ్ ఉంది. ఇప్పటికే మూడు ఫుల్ సాంగ్స్, ఒక బిట్ సాంగ్ షూటింగ్ పూర్తయ్యింది.. షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 21 నుంచి మిగిలిన ఒక్క పాట (చివరి) షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాము.

ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.. పాట గురించి చెబుతున్నదంతా ఓ గాసిప్ మాత్రమే. క్లిక్స్ కోసం కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు మీరు ఏ అంశంపై స్పందిస్తారో బాగా తెలుసు. మేము ఏమీ మాట్లాడకపోవడం వల్ల.. వాళ్లు చేస్తున్న ప్రచారం నిజమని అర్థం కాదు’ అని నాగవంశీ తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. కాగా గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు