తన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగ్ ఎమోషనల్ ప్రెస్ నోట్

తన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగ్ ఎమోషనల్ ప్రెస్ నోట్

Published on Aug 24, 2024 1:13 PM IST

మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఫ్యామిలీ అండ్ లేడీస్ ఫేవరెట్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. మరి కింగ్ నాగ్ బర్త్ డే కానుకగా ఈ ఆగస్ట్ లోనే “మాస్” రీ రిలీజ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ప్లానింగ్ లు కూడా అభిమానులు చేసుకుంటున్నారు. కానీ ఇంతలోనే హైదరాబాద్ లో ఉన్నటువంటి తన ఎన్ కన్వెన్షన్ హాల్ ని ప్రభుత్వం ఈరోజు ఉదయం నుంచే కూల్చివేత చేయడం అనేది ఒక్కసారిగా అందరిలో షాకింగ్ గా మారింది.

సోషల్ మీడియాలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూల్చివేత దృశ్యాలు వైరల్ గా మారడం జరిగింది. అయితే దీనిపై నాగ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనే సమయంలో తాను ఒక ఎమోషనల్ పోస్ట్ అండ్ ప్రెస్ నోట్ ద్వారా ఈ ఘటనపై స్పందించారు… “స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎస్ కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను.

ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట వివిరుధ్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు.

చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను” అంటూ నాగ్ తెలిపారు. మరి ఈ విషయంలో నాగ్ కోరుకున్న న్యాయం దక్కాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు