ఫోటో మూమెంట్: మంత్రి సీతక్కతో నమ్రత.. పవర్‌ఫుల్ లేడీస్!

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరద భీభత్సంతో ఎంతో మంది ప్రజలు తీవ్ర కష్టాలపాలయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు తమవంతు సాయంగా విరాళాలు అందజేశారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తాను ప్రకటించిన విరాళ సాయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అందజేశాడు.

తన భార్య నమ్రతతో కలిసి సీఎం రేవంత్‌కు రూ.50 లక్షల చెక్కును మహేశ్ బాబు అందజేశాడు. ఈ సందర్భంగా రేవంత్ మహేశ్‌ని శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న మంత్రి సీతక్కతో నమ్రత ఓ ఫోటో దిగారు. ఇది సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అభిమానులు దీన్ని వైరల్ చేస్తున్నారు.

ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు పవర్‌ఫుల్ లేడీస్.. అంటూ ఘట్టమనేని అభిమానులు ఈ ఫోటోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేశ్ కూడా సరికొత్త లుక్‌తో కనిపించడంతో ఆయన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

Exit mobile version