ఆమెను అమ్మ అనే పిలుస్తా – కళ్యాణ్ రామ్

Kalyan_Ram

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి”. నటి, ఎమ్మెల్సీ విజయశాంతి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఐతే, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘తండ్రీకొడుకులు పలు విషయాల్లో గొడవ పడడం చివరకు ఒక్కటవడం చాలా సినిమాల్లో చూశాం. మా సినిమాలో.. ఎంతో ప్రేమగా ఉండే తల్లీకొడుకులు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? మళ్లీ ఎలా కలుసుకున్నారు? అనేదే కీలకం. ఈ కథలో తల్లి పాత్రలో విజయశాంతి మేడమ్‌నే ఊహించుకున్నాను. నేను ఆమెను విజయశాంతి గారు అని అనను. మనస్ఫూర్తిగా అమ్మ అనే పిలుస్తాను’ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.

ఇదే ప్రమోషన్స్‌లో విజయశాంతి మాట్లాడుతూ.. ‘‘సినిమా పరిశ్రమకు కల్యాణ్‌ బాబు చాలామంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. ఈ సినిమా విడుదల తర్వాత ప్రదీప్‌ (దర్శకుడు)కు మరిన్ని అవకాశాలొస్తాయి. ఇక ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్ రాజీపడకుండా నటించారు’’ అని విజయశాంతి తెలిపారు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సహా అశోక క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Exit mobile version