మండే మేమంతా వెళ్తాం గబ్బర్ సింగ్ కి – నాని

మండే మేమంతా వెళ్తాం గబ్బర్ సింగ్ కి – నాని

Published on Sep 1, 2024 9:00 AM IST

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం చిత్రం సూపర్ సక్సెస్ ను సాధించింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం సక్సెస్ తో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి, ప్రేక్షకులను థాంక్స్ తెలిపింది. ఈ కార్యక్రమంలో నిర్మాత డీవీవీ దానయ్య కూడా పాల్గొన్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ తో సరిపోదా శనివారం కి థియేటర్ల కొరత ఉంది అని టాక్ వినిపిస్తోంది అంటూ ప్రశ్నించారు.

అందుకు డీవీవీ దానయ్య సమాధానం ఇస్తూ, గబ్బర్ సింగ్ అది పవర్ స్టార్, అది వేరే లెవెల్. ఇది వేరే లెవెల్. ఏ సినిమాకి ఆ సినిమానే. ఇది నాచురల్ స్టార్, అది పవర్ స్టార్ అని అన్నారు. నాని కూడా రెస్పాండ్ అవుతూ, మండే మేమంతా వెళ్తాం గబ్బర్ సింగ్ కి అని అన్నాడు. డీవీవీ దానయ్య పవన్ కళ్యాణ్ తో ఓజి చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు