రీ-రిలీజ్ కు సిద్ధ‌మైన ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు మూవీ

రీ-రిలీజ్ కు సిద్ధ‌మైన ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు మూవీ

Published on Jul 23, 2024 7:04 PM IST

ప్రేమ క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 2012లో వ‌చ్చిన ‘ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు’ ప్రేక్ష‌కుల్లో ఓ ప్ర‌త్యేక ముద్ర‌ను వేసుకుంది. నేచుర‌ల్ స్టార్ నాని, స్టార్ బ్యూటీ స‌మంత జంట‌గా న‌టించిన ఈ ప్యూర్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ యూత్ ను బాగా ఆక‌ట్టుకుంది. ఇక ఈ సినిమా పాట‌లు ఇప్ప‌టికీ ఆడియెన్స్ ను మైమ‌ర‌పిస్తున్నాయి.

ఈ సినిమాకు చాలా మంది యూత్ క‌నెక్ట్ కావ‌డం అప్ప‌ట్లో సెన్సేష‌న్. అయితే, ఇలాంటి యూత్ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ చిత్రం ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ను మైమ‌ర‌పించేందుకు సిద్ధ‌మైంది. ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 2న రీ-రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ న‌డుస్తున్న నేప‌థ్యంలో, ఈ ల‌వ్ స్టోరీ చిత్రం యూత్ ను బాగా అట్రాక్ట్ చేస్తుంద‌ని వారు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాను లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా అందించిన సంగీతం ఎవ‌ర్ గ్రీన్ గా నిలిచింది. మ‌రి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు