బుక్ మై షోలో ‘సరిపోదా శనివారం’ ర్యాంపేజ్

బుక్ మై షోలో ‘సరిపోదా శనివారం’ ర్యాంపేజ్

Published on Sep 3, 2024 11:40 PM IST

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘సరిపోదా శనివారం’ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి హౌజ్‌ఫుల్ షోస్ తో దూసుకుపోతుంది.

తాజాగా ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో సరిపోదా శనివారం తన ర్యాంపేజ్ చూపిస్తోంది. ఏకంగా 1 మిలియన్‌కి పైగా ఈ సినిమా టికెట్లు బుక్ మై షోలో బుకింగ్స్ అయినట్లుగా తెలుస్తోంది. నాని సినిమాకు ఉండే క్రేజ్‌కి తోడుగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకులు ఇంప్రెస్ కావడంతో, మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తున్నారు.

విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య విలన్‌గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వగా, అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు