జానీ మాస్టర్ నేషనల్ అవార్డు క్యాన్సిల్

టాలీవుడ్‌లో కొరియోగ్రఫర్‌గా సత్తా చాటిన జానీ మాస్టర్, రీసెంట్‌గా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనవద్ద పనిచేస్తున్న ఓ లేడీ కొరియోగ్రఫర్‌పై జానీ ఈ వేధింపులకు పాల్పడ్డాడని కేసు నమోదైంది. అయితే, బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పటి నుంచే ఈ వేధింపులు ఉన్నాయని పేర్కొనడంతో అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది.

ఇది ఇప్పుడు ఆయన ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది. రీసెంట్‌గా జానీ మాస్టర్‌కు బెస్ట్ కొరియోగ్రఫర్‌గా నేషనల్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో, ఆయనకు అవార్డును క్యాన్సిల్ చేస్తున్నట్లు అవార్డు కమిటీ ప్రకటించింది.

దీంతో జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు ఇక రానట్టేనని అందరూ డిసైడ్ అవుతున్నారు. మరి ఈ అవార్డును ఇంకెవరికైనా ఇస్తారా లేదా అనేది చూడాలి.

Exit mobile version