‘డబుల్ ఇస్మార్ట్’ కోసం మణిశర్మ సిద్ధం !

‘డబుల్ ఇస్మార్ట్’ కోసం మణిశర్మ సిద్ధం !

Published on Oct 2, 2023 1:02 PM IST

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం జతకడుతున్న సంగతి తెలిసిందే. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా వచ్చే షెడ్యూల్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారట. సంజయ్ దత్ విలన్ పాత్ర ఈ సీక్వెన్స్ లోనే రివీల్ అవుతుందని.. రామ్ పై అటాక్ చేస్తూ.. సంజయ్ దత్ చాలా వైల్డ్ గా ఈ సీక్వెన్స్ లో కనిపిస్తాడట .

ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్‌ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మరి డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు