అల్లు అర్జున్ మూవీ పై నిర్మాత క్రేజీ కామెంట్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి తాజాగా మాట్లాడుతూ.. ‘ఇది చాలా పెద్ద సినిమా. ఏ జోనర్ అనేది తెలీదు. ప్రస్తుతం త్రివిక్రమ్ స్టోరీపై కసరత్తు చేస్తున్నారు. ఇది అతిపెద్ద పాన్ ఇండియా మూవీగా నిలుస్తుంది’ అని చెప్పారు.

కాగా గతంలో బన్నీ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 3 సినిమాలు జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో సూపర్ హిట్‌ గా నిలవడంతో ఈ కాంబోపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.

Exit mobile version