‘ఆయ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా నిఖిల్

‘ఆయ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా నిఖిల్

Published on Aug 13, 2024 2:30 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఆయ్’ సినిమా ఆగస్టు 15న రేస్‌లో మంచి అంచనాల మధ్య రిలీజ్ కానుంది. ఈ సినిమాను అంజి కె మణిపుత్ర

డైరెక్ట్ చేయగా పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బన్నీ

వాస్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా కంటెంట్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో

దూసుకుపోతుంది.

ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని నేడు సాయంత్రం గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కి ముఖ్య

అతిథిగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ రాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని దాస్పల్లా హోటల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించబోతున్నట్లుగా వారు ప్రకటించారు. ఇక ఈ ఈవెంట్‌కి మరికొంత మంది సెలబ్రిటీలు కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

నార్నె నితిన్, నయన్ సారిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఆయ్’ మూవీని మేకర్స్ పూర్తిగా గోదావరి నేపథ్యంలో సాగే కథగా రూపొందించారు. ఈ సినిమాలోని కామెడీ, ఎమోషన్ ఆడియెన్స్‌ను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయ్ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి నిఖిల్‌తో పాటు ఇంకా ఎవరెవరు వస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు