రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న “ది ఇండియా హౌస్”

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. చివరిసారిగా యాక్షన్ థ్రిల్లర్ స్పై చిత్రంలో కనిపించారు. తదుపరి స్వయంభు చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంతో పాటుగా మరొక చిత్రం ది ఇండియా హౌస్ ను నిఖిల్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, రేపు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభం కానుంది. విరూపాక్ష దేవాలయం, హంపి, కిష్కింధ ప్రాంతంలో ఈ పూజా కార్యక్రమం జరగనుంది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు వి మెగా పిక్చర్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ వంశీ కృష్ణ రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version