రీ-రిలీజ్‌కి సిద్ధమవుతున్న నితిన్-రాజమౌళిల ‘సై’ మూవీ

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ హీరో నితిన్ నటించిన సినిమా ‘సై’ అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. పూర్తి యూత్‌ఫుల్ కంటెంట్‌తో ఈ సినిమా రావడం.. రగ్బీ అనే ఆట చుట్టు కథ సాగడంతో అప్పటి యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఈ సినిమాను ఇప్పుటి ఆడియెన్స్ కోసం మరోసారి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో.. ‘సై’ చిత్రాన్ని కూడా రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర రీ-రిలీజ్ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది త్వరలో వెల్లడిస్తామని డిస్ట్రిబ్యూషన్ సంస్థ మెగా ప్రొడక్షన్స్ తెలిపింది.

ఈ సినిమాలో నితిన్ సరసన జెనీలియా హీరోయిన్‌గా నటించగా ప్రదీప్ రావత్ భిక్షు యాదవ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఎంఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version